News April 1, 2024
FY25 షురూ.. స్టాక్ మార్కెట్ల జోరు

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గరిష్ఠంగా 22,529 మార్క్ తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసిన నిఫ్టీ ప్రస్తుతం 22,468 వద్ద కొనసాగుతోంది. మరోవైపు సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా లాభాన్ని నమోదు చేసి గరిష్ఠంగా 74,254ను తాకింది. JSWస్టీల్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, దివిస్ ల్యాబ్, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
Similar News
News April 6, 2026
డిసెంబర్లో మహిళలకు చీరలు: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో మహిళలకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. వారికి డిసెంబర్లో చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ ‘గతంలో ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. పాల పిట్టల్లా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి చిలక పచ్చ రంగు చీరలకు నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరుతున్నా. పుట్టింటి సారెలా ఆడబిడ్డలకు చీరలు ఇస్తాం’ అని పేర్కొన్నారు.
News April 6, 2026
వర్షంతో ఆగిన మ్యాచ్

ఈడెన్ గార్డెన్స్లో KKR, PBKS మ్యాచ్ వర్షంతో ఆగింది. 3.4 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో ఆటను నిలిపేశారు. భారీ వాన పడుతుండటంతో గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి KKR స్కోర్ 25-2గా ఉంది. అలెన్ 6, గ్రీన్ 4 పరుగులు చేసి బార్ట్లెట్ బౌలింగ్లో ఔటయ్యారు.
News April 6, 2026
‘లాకప్ డెత్’.. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన కేసు

TNలోని మదురై <<19583236>>కోర్టు<<>> తీర్పుతో లాకప్డెత్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. లాక్డౌన్లో షాప్స్ త్వరగా మూసివేయిస్తున్నారని జయరాజ్ చేసిన విమర్శతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నించిన కొడుకునీ లాకప్లో వేసి హింసించడంతో వారు చనిపోయారు. దీనిని పోలీసులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించగా నిరసనలు చెలరేగడంతో కేసును CBI టేకోవర్ చేసింది. ఐదేళ్లలో 100 మందికిపైగా సాక్షులను విచారించి కోర్టు ఈ తీర్పునిచ్చింది.


