News March 18, 2024
గద్వాల: పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

గద్వాల జిల్లా మానవపాడు మండలం చిన్న పోతులపాడుకి చెందిన ప్రవీణ్, మధు అనే టెన్త్ విద్యార్థులు ఉదయం పరీక్ష రాసేందుకు బైక్ పై స్వగ్రామం నుంచి మానవపాడులోని పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా మానవపాడు శివారులో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అటుగా వెళుతున్న ప్రయాణికులు గ్రహించి మానవపాడు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి కర్నూలుకు తరలించారు. దీంతో వారు తొలిరోజు పరీక్ష తప్పారు.
Similar News
News November 15, 2025
MBNR: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులకు గడువు పెంపు

ప్రభుత్వ ఆదేశాల మేరకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఒక ప్రకటన ద్వారా వెలడించారు. జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. వివరాలకు 77309 09838 నంబర్ సంప్రదించాలన్నారు.
News November 15, 2025
పాలమూరు: పీయూలో యాంటీ ర్యాగింగ్ అవగాహన

పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, బీఎఎస్ చట్టంలోని కఠిన సెక్షన్ల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా డి మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 15, 2025
MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

మహబూబ్నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.


