News March 16, 2024

గద్వాల: రెండు బైక్ ఢీ.. ఒకరి మృతి

image

రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ధరూర్ మండలం అల్వాల్ పాడ్ గ్రామానికి చెందిన రమేష్ (26) అదే గ్రామానికి చెందిన రాము.. బైక్ పై ధరూర్ మండల కేంద్రానికి వెళ్తుండగా పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందాగా.. రాము తీవ్రంగా గాయపడ్డాడు. రాముని ఆస్పత్రికి తరలించారు.

Similar News

News August 23, 2025

MBNR: నేరచరిత్ర.. విచారణ చేపట్టండి- SP

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డి.జానకి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్పీ సూచించారు. SC,ST యాక్ట్, ఉమెన్ అగైనెస్ట్ కేసులు, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. DSP వెంకటేశ్వర్లు, CIలు అప్పయ్య, ఇజాజ్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

News August 22, 2025

పాలమూరు: APK ఫైల్.. బి కేర్ ఫుల్..!

image

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. SMలో ఏపీకే ఫైల్ ద్వారా ఫేక్ లింక్ పంపించి ఫోన్లను హ్యాక్ చేసి ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. SHARE IT

News August 22, 2025

పాలమూరు: UG, PG..APPLY చేసుకోండి

image

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.