News March 3, 2025
అచ్చెన్న ‘గాలి’ వ్యాఖ్యలు.. బొత్స కౌంటర్

AP: మండలి ప్రతిపక్షనేత బొత్సను ఉద్దేశిస్తూ గాలికి వచ్చారంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంతో దుమారం చెలరేగింది. దీనిపై మాజీ మంత్రి కౌంటరిచ్చారు. ‘నేను గాలికి వచ్చానంటూ మాట్లాడారు. నేను 1999లో తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టా. 42మందికిగాను INC నుంచి గెలిచిన ఐదుగురిలో నేనొకడిని. టీడీపీ హవాలోనూ నా భార్య ZP ఛైర్మన్ అయ్యారు. ఈ విషయం తెలిసినా కించపరిచేలా మాట్లాడటం సబబు కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు కట్టడి ఎలా?

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.
News December 30, 2025
ఫలించిన RBI ప్లాన్.. పుంజుకున్న ‘రూపాయి’

డాలరుతో రూపాయి మారకం విలువ నేడు 14పైసలు లాభపడి రూ.89.84కు చేరింది. రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించడంతో రూపాయి కాస్త బలపడింది. పారిశ్రామిక ఉత్పత్తి భారత కరెన్సీ బలపడటానికి సపోర్ట్గా నిలిచినప్పటికీ బలమైన డాలర్, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, ఫారిన్ ఫండ్స్ ప్రవాహం మరింత బలపడకుండా అడ్డుకున్నాయి. రూ.89.98 వద్ద మొదలైన ట్రేడింగ్ ఒక దశలో 89.72కు చేరినా చివరకు 89.84 వద్ద ముగిసింది.
News December 30, 2025
జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల

APలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో ప్రభుత్వం తెలిపింది. దీంతో APలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. అటు 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు పలు డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చింది. 2025 DEC 31 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది.


