News March 3, 2025

అచ్చెన్న ‘గాలి’ వ్యాఖ్యలు.. బొత్స కౌంటర్

image

AP: మండలి ప్రతిపక్షనేత బొత్సను ఉద్దేశిస్తూ గాలికి వచ్చారంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంతో దుమారం చెలరేగింది. దీనిపై మాజీ మంత్రి కౌంటరిచ్చారు. ‘నేను గాలికి వచ్చానంటూ మాట్లాడారు. నేను 1999లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టా. 42మందికిగాను INC నుంచి గెలిచిన ఐదుగురిలో నేనొకడిని. టీడీపీ హవాలోనూ నా భార్య ZP ఛైర్మన్ అయ్యారు. ఈ విషయం తెలిసినా కించపరిచేలా మాట్లాడటం సబబు కాదు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 21, 2025

సడన్‌గా బయటకు సార్..! కారణమేంటి..?

image

BRS శ్రేణులు సార్ అని పిలిచే KCR చాలాకాలం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఇకనుంచి ప్రజల్లోనే అని ప్రకటించారు. ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీకి కారణమేంటని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఎన్నికలై రెండేళ్లైనా బయటకు రాకుంటే తప్పుడు ప్రచారంతో ఉనికి ప్రశ్నార్థకం కావొచ్చనా? వచ్చే ఏడాది MPTC, ZPTC, GHMC ఎన్నికలు, 2028లో అసెంబ్లీ ఎన్నికలు వరుసగా ఉన్నాయనా? మీ కామెంట్?

News December 21, 2025

ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ అన్యాయం: రేవంత్

image

TG: కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం పెట్టిన ద్రోహి KCR అని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ఆ సంతకంతో 3 జిల్లాలకు మరణశాసనం రాశారని విమర్శించారు. ‘ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కాళేశ్వరం కూలినా వరి ఉత్పత్తిలో TGని అగ్రస్థానంలో నిలిపాం. కృష్ణా జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. పదేళ్ల KCR పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు’ అని చిట్‌చాట్‌లో మండిపడ్డారు.

News December 21, 2025

KCR నోట 15 సార్లు చంద్రబాబు పేరు!

image

చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ దాదాపు 15 సార్లు ఆయన పేరును ఉచ్చరించారు. ఆనాటి పాలమూరు దత్తత, ఆర్డీఎస్ ధ్వంసం, కృష్ణా, గోదావరి జలాలను దోచుకుంటున్నారంటూ పదేపదే ఎత్తి చూపారు. కేంద్రం మద్దతుతో చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఫైరయ్యారు. పెట్టుబడుల్లోనూ టీడీపీ అధినేతపై జోకులు పేల్చారు. దీంతో మళ్లీ కేసీఆర్ సెంటిమెంటును తెరపైకి తెచ్చారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.