News August 27, 2024
రాజ్యసభ వైపు గల్లా జయదేవ్ చూపు?

AP: గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి ఆయనను ఎంపిక చేస్తారని పేర్కొంటున్నాయి.
Similar News
News November 21, 2025
ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 21, 2025
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్

BSFలోకి మొట్టమొదటిసారి మహిళా స్నైపర్ ఎంటర్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాకు చెందిన సుమన్ కుమారి ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్లో కఠిన శిక్షణను పూర్తిచేసి ‘ఇన్స్ట్రక్టర్ గ్రేడ్’ పొందారు. 2021లో BSFలో చేరిన ఆమె పంజాబ్లో ఓ బృందానికి నాయకత్వం వహించారు. స్నైపర్ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.
News November 21, 2025
కొత్త టీచర్లకు సెలవులు ఇలా..

AP: మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించుకోవచ్చని తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఎంపికైన విషయం తెలిసిందే.


