News April 19, 2024
Gallery: ఓటెత్తిన ప్రముఖులు

దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. వేసవి కావడంతో ఉదయాన్నే ఓటింగ్ సెంటర్లకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయాచోట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News November 24, 2025
హుకుంపేటలో యాక్సిడెంట్..ఒకరు మృతి

హుకుంపేటలోని ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..మండలంలోని నూర్పురాయికి చెందిన శ్రీను బైక్పై వెళ్తుండగా తాడేపుట్టు పంచాయతీ పరిధి సాయిరాం మందిరం వద్ద అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
బీమా కంపెనీల విలీనం.. పార్లమెంటులో బిల్లు?

బ్యాంకుల తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లను ఒకే కంపెనీగా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. వాటిని ఆర్థికంగా మెరుగుపర్చడమే దీని ఉద్దేశం. 2018-19లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో వీటి బలోపేతానికి కేంద్రం ₹17450Cr కేటాయించింది.
News November 24, 2025
ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులకు నోటిఫికేషన్

పశ్చిమ బెంగాల్లోని <


