News August 4, 2024
గంభీర్ ఎక్కువ కాలం కోచ్గా ఉండలేడు: జోగిందర్

ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్గా ఎక్కువ కాలం ఉండలేడని మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు అతడిపై వ్యక్తిగత ద్వేషమేమీ లేదని చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్గా ఉండలేడు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
పల్నాడు జిల్లాలో మార్పు లేనట్లేనా..?

జిల్లాల పునర్విభజన కసరత్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో మార్పులు చేర్పులు ఉండబోవని సమాచారం. మంత్రివర్గ ఉప సంఘం సీఎంతో జరిపిన సమావేశంలో కొత్త జిల్లాలలో అమరావతి జిల్లా ప్రస్తావనకు రాలేదు. నాగార్జునసాగర్, పులిచింతల, అమరావతి వంటి ప్రముఖ ప్రాంతాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు జిల్లా నుంచి వెళ్తూ ఉండడంతో పల్నాడు రాజధాని జిల్గా గా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
News November 26, 2025
సంకల్ప అమలుతో ఇంటర్ పాస్ పర్సంటేజ్ పెంచాలి: RJD

సంకల్ప 50 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసి ఇంటర్ పాస్ పర్సంటేజ్ పెంచాలని RJD శేఖర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం RJD అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులకు సంకల్పపై దిశానిర్ధేశం చేశారు. ముఖ ఆధారిత అటెండెన్స్ తప్పనిసరి అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డీపీజే కుమార్, ఇంఛార్జ్ ప్రిన్సిపల్ పార్వతి, సిబ్బంది ఉన్నారు.
News November 26, 2025
పల్నాడు జిల్లాలో మార్పు లేనట్లేనా..?

జిల్లాల పునర్విభజన కసరత్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో మార్పులు చేర్పులు ఉండబోవని సమాచారం. మంత్రివర్గ ఉప సంఘం సీఎంతో జరిపిన సమావేశంలో కొత్త జిల్లాలలో అమరావతి జిల్లా ప్రస్తావనకు రాలేదు. నాగార్జునసాగర్, పులిచింతల, అమరావతి వంటి ప్రముఖ ప్రాంతాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు జిల్లా నుంచి వెళ్తూ ఉండడంతో పల్నాడు రాజధాని జిల్గా గా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


