News January 2, 2025
ఇకపై తాను చెప్పినట్లు ఆడాల్సిందేనన్న గంభీర్?

ఎంసీజీలో భారత్ ఓటమి అనంతరం ఆటగాళ్లందరిపై గంభీర్ తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పోర్ట్స్ తక్ కథనం ప్రకారం.. ‘6 నెలలుగా మీరు ఎలా ఆడితే అలా వదిలేశాను తప్ప ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. సైలెంట్గా ఉన్నది మీరు లోకువ తీసుకుంటారని కాదు. ఇక చాలు. ఇకపై నేను చెప్పినట్లుగానే గేమ్ ప్లాన్ ఉంటుంది. అది అమలుచేసేవాళ్లు మాత్రమే ఆడతారు. చేయలేని వారికి థాంక్యూ’ అని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


