News October 31, 2024
మ.12.06గంటలకు ‘గేమ్ ఛేంజర్’ టీజర్?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి కానుకగా ఈరోజు మధ్యాహ్నం 12.06గంటలకు అంటూ యూనిట్ ఓ ట్వీట్ చేసింది. అయితే గతంలో దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఈరోజు వచ్చేది టీజర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అడ్వాణీ హీరోయిన్ నటిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Similar News
News November 26, 2025
నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
News November 26, 2025
నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
News November 26, 2025
ఏడాదికి లక్ష మంది అగ్నివీర్ల నియామకానికి ప్లాన్!

రాబోయే 4 ఏళ్లలో ఏడాదికి లక్ష మంది అగ్నివీర్లను నియమించుకోవాలని ఆర్మీ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా 1.8 లక్షలుగా ఉన్న సైనిక కొరతను అధిగమించాలని భావిస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 2022 నుంచి ప్రతి ఏడాది 45వేల నుంచి 50వేల మంది అగ్నివీర్లను ఆర్మీ నియమిస్తోంది. కరోనా కారణంగా 2020, 21లో రిక్రూట్మెంట్లు నిలిపివేయడం, అప్పుడే ఏడాదికి 60వేల నుంచి 65వేల మంది రిటైర్ కావడంతో సైనికుల కొరత ఏర్పడింది.


