News April 5, 2024
‘గేమ్ ఛేంజర్స్ ఆఫ్ ఇండియా’
ఉప్పల్ స్టేడియంలో ధోనీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్స్ ఆఫ్ ఇండియా’ అంటూ ఇద్దరి ఫొటోలతో పోస్టర్ క్రియేట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘ఒకరు ఐసీసీ ట్రోఫీల కింగ్.. మరొకరు బాక్సాఫీస్ కింగ్’ అంటూ పోస్టర్పై రాసుకొచ్చారు. ధోనీ-తారక్ ఫొటోలతో మరో పోస్టర్ను యంగ్ టైగర్ ఫ్యాన్స్ ప్రదర్శించారు.
Similar News
News October 8, 2024
త్వరలో గ్రామబాట కార్యక్రమం: పెద్దిరెడ్డి
AP: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు సమావేశానికి హాజరయ్యారు.
News October 8, 2024
తాజ్మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు
భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్మహల్ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్లో రాశారు. భారత్లో 4 రోజుల టూర్లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.
News October 8, 2024
ఆ కాఫీ ధర రూ.335.. అందులో బొద్దింక!
ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో లోపెరా బేకరీలో ఓ కస్టమర్ రూ.335 ఖరీదైన ఐస్డ్ లాటే ఆర్డర్ ఇచ్చారు. తాగే సమయంలో ఏదో కాఫీ గింజలా తేలుతుండటంతో స్పూన్తో వెనక్కి తిప్పారు. తీరా చూస్తే అది బొద్దింక. ఈ విషయాన్ని ఆమె రెడిట్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, డబ్బులు వెనక్కిచ్చామని, మరో కాఫీ ఆఫర్ చేశామని బేకరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో కాఫీ తాగేందుకు ఆ కస్టమర్ సాహసించలేదు.