News March 14, 2025

టాటా కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా గణపతి సుబ్రహ్మణ్యం

image

తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా టాటా సంస్థ గణపతి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. నామినేషన్-రెమ్యునరేషన్ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన 2021లో బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టీసీఎస్‌లో ఆయన గత 40 ఏళ్లుగా సేవలందించారు. ఆ సంస్థకు సీఓఓగా పనిచేసి గత ఏడాది మేలో పదవీవిరమణ చేశారు.

Similar News

News October 27, 2025

అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు: అనిత

image

AP: తుఫాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు శాటిలైట్ ఫోన్లు అందించడంతో పాటు NDRF, SDRF బృందాలను సిద్ధం చేశామన్నారు. సహాయక చర్యల కోసం ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బంది కూడా రెడీగా ఉన్నట్లు వివరించారు. అలాగే కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సాయం, తుఫాను సమాచారం కోసం పై నంబర్లను సంప్రదించాలన్నారు.

News October 27, 2025

యజ్ఞంలా కోటి సంతకాల సేకరణ: YCP

image

AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ యజ్ఞంలా సాగుతోందని YCP ట్వీట్ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంది. పార్టీ నేతలు YS అవినాశ్‌రెడ్డి, YS మనోహర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కార్యక్రమం జరుగుతోందని పేర్కొంది. ప్రైవేటీకరణతో ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారంది.

News October 27, 2025

7,565 కానిస్టేబుల్ పోస్టులు.. 4 రోజులే గడువు

image

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు SSC నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగియనుంది. 18-25 ఏళ్ల వయసువారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. రాతపరీక్ష, PE&MT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. DEC/JANలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పేస్కేల్ రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: <>https://ssc.gov.in/<<>>