News December 25, 2024

గాంధీ వందేళ్ల జ్ఞాపకం.. 2 రోజులు CWC సమావేశాలు

image

ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.

Similar News

News October 29, 2025

ఏపీలో ఆ జిల్లాల్లో సెలవులు.. కాకినాడలో రద్దు

image

తుఫాను క్రమంగా బలహీనపడటంతో ఏపీలోని కాకినాడ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు రద్దు చేశారు. ఈ నెల 31వరకు సెలవులు ఇవ్వగా పరిస్థితి అదుపులోకి రావడంతో విద్యార్థులు రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రావాలని అధికారులు ఆదేశించారు. అటు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు, కాలేజీలు ఉంటాయని స్పష్టం చేశారు.

News October 29, 2025

వైఫల్యాలు విజయాలకు మెట్లు!

image

మీరు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని బాధపడుతున్నారా? విజయం పొందలేమని ఆందోళన చెందుతున్నారా? మీలానే సర్ జేమ్స్ డైసన్ అనుకుని తన ప్రయత్నాలను ఆపితే బ్యాగ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్‌ రూపొందేదా? ఆయన ఏకంగా 5,126 సార్లు విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన స్థాపించిన డైసన్ లిమిటెడ్ కంపెనీ వార్షికాదాయం ₹75,300 కోట్లు. వైఫల్యం అనేది ఆగిపోవడానికి సంకేతం కాదు.. ఇది విజయానికి మెట్టు అని గుర్తుంచుకోండి.

News October 29, 2025

పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి: CBN

image

AP: వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని వేగంగా చేపట్టాలని CM CBN ఆదేశించారు. నీరు నిలవకుండా డ్రైనేజీల్ని పటిష్ఠం చేయాలన్నారు. విద్యుత్తు సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి నిత్యావసరాలు అందించాలన్నారు. కాగా రాష్ట్రంలో 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లోని 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని అధికారులు వివరించారు.