News April 2, 2025
గాంధీ ముని మనవరాలు కన్నుమూత

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.
Similar News
News November 15, 2025
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్

TG: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో జీవ, భౌతిక, సాంఘికశాస్త్రం, గణితం సబ్జెక్టు మెటీరియల్సే అందజేసేది. ఈసారి వాటితో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకూ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈనెలలో పంపిణీ చేసేందుకు 2 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.7.52 లక్షల స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేయిస్తోంది.
News November 15, 2025
NFCలో 405 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC)405 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎలక్ట్రీషియన్ పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 15, 2025
మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపుల తర్వాత నీటి తడులు – జాగ్రత్తలు

మల్లె మొక్క కొమ్మల కత్తిరింపు తర్వాత మొక్కకు నీటి అవసరం ఎక్కువగా ఉండదు. ఈ సమయంలో అధిక నీటిని అందిస్తే మొక్కల వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. అందుకే నేల మరీ తడిగా, నీరు నేలపై నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒక వేలిని నేలలో 2-3 అంగుళాల లోతు వరకు పెట్టి నేల ఎండినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి. మొక్క నుంచి కొత్త చిగురు, మొగ్గలు వచ్చే సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.


