News September 15, 2024
గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైళ్ల సమయం పెంపు

TG: ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సేవలను అధికారులు పొడిగించారు. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైలు బయల్దేరుతుందన్నారు. మరోవైపు అవసరాన్ని బట్టి నిమజ్జనం ముగిసే వరకు అదనపు రైళ్లు నడిపిస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News February 14, 2026
పనసలో కాయకుళ్లుతో కలిగే నష్టాలు

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
News February 14, 2026
AI సమ్మిట్కు NVIDIA సీఈవో దూరం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నెల 16 నుంచి 20 వరకు ఢిల్లీలో AI Impact Summit నిర్వహిస్తోంది. దీనికి NVIDIA సీఈవో జెన్సెన్ హువాంగ్ కూడా రావాల్సి ఉండగా తాజాగా పర్యటన రద్దయింది. అనివార్య కారణాలతో ఆయన రాలేకపోతున్నారని కంపెనీ తెలిపింది. 100 దేశాల నుంచి 35,000 మంది అతిథులు సమ్మిట్కు రానుండగా వీరిలో బిల్గేట్స్, ఆల్ట్మన్, పిచాయ్ తదితరులున్నారు.
News February 14, 2026
శివరాత్రి: చిన్న పరిహారంతో దోషాలన్ని దూరం!

లోకకల్యాణం కోసం శివలింగం శాంతంగా, చల్లగా ఉండాలి. అందుకే దానిపై నిత్యం నీటి ధారలు పడేలా ‘ధారాపాత్ర’ను ఏర్పాటు చేస్తారు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడి నుంచి కురిసే అమృతధారలకు ఇది సంకేతం. మహాశివరాత్రి నాడు మనం చేసే అభిషేకంతో శివలింగం చల్లబడుతుంది. శివలింగం చల్లబడటం అంటే సమస్త ప్రాణికోటి సుఖశాంతులతో ఉండటమే. కాబట్టి ఆయనను అభిషేకిస్తే సకల పాపాలు తొలగిపోయి, మనశ్శాంతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


