News September 10, 2024

హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలు.. హైకోర్టు కీలక తీర్పు

image

TG: హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2021లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలను GHMC ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం చేయాలని తెలిపింది.

Similar News

News December 17, 2025

ఏపీలో 6 జోన్లు.. ఏ జిల్లా ఎక్కడంటే?

image

రాష్ట్రంలో 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా <<18586844>>కేంద్రం<<>> విభజించింది.
*జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, VZG, అనకాపల్లి.
*జోన్-2: అల్లూరి, తూ.గో., కాకినాడ, కోనసీమ.
*జోన్-3: ప.గో., ఏలూరు, కృష్ణా, NTR.
*జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.
*జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప.
*జోన్-6 : కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి.
*మల్టీజోన్-1: జోన్-1, 2, 3
*మల్టీజోన్-2: జోన్-4, 5, 6

News December 17, 2025

చిన్నతనంలో ఊబకాయం రాకూడదంటే..!

image

చిన్నారుల్లో ఊబకాయం రాకూడదంటే శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. పిల్లలు ఔట్ డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా పిల్లలు బరువు పెరగవచ్చు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 8-9 గంటలు నిద్రపోయేలా టైమ్ టేబుల్ సెట్ చేయండి. పిల్లల్లో ఊబకాయాన్ని నివారించడానికి, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

News December 17, 2025

మూడో నేత్రం తెరుద్దామా?

image

శివుడికే కాదు మనక్కూడా 3 నేత్రాలు ఉంటాయి. నుదిటిపై కుంకుమ ధరించడం వల్ల ఆ నేత్రాన్ని తెరవొచ్చని పండితులు చెబుతున్నారు. ‘మన శరీరంలో 7 శక్తి చక్రాలు ఉంటాయి. అందులో మూడోది నుదిటిపై ఉంటుంది. అక్కడ కుంకుమ ధరిస్తే మూడో చక్రం ఉత్తేజితమవుతుంది. అది మన ఆత్మ శక్తిని పెంచుతుంది. అయితే అమ్మాయిలు ప్లాస్టిక్‌తో చేసిన కృత్రిమ బిందీ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవట. పాజిటివ్ ఎనర్జీకై సహజ కుంకుమను వాడుదాం.