News September 19, 2024
ఆన్లైన్ ట్రోలింగ్పై పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

తనను నెట్టింట ట్రోల్ చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యల్ని కోరుతూ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కోల్కతా పోలీసుల్ని ఆశ్రయించారు. ‘మృణ్మయ్ దాస్ అనే వ్యక్తి నన్ను లక్ష్యంగా చేసుకుని దూషిస్తూ కించపరిచే వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. దయచేసి వెంటనే అతడిపై చర్యలు తీసుకోండి’ అని గంగూలీ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News January 22, 2026
DGEMEలో ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DGEME) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.indianarmy.nic.in/
News January 22, 2026
ట్రంప్ విమర్శలపై మోదీ మౌనం వెనక మతలబిదీ..!

ప్రపంచ నేతలను ట్రంప్ ఎడాపెడా వాయించేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, కెనడా PM కార్నీ, UK PM స్టార్మర్.. ఇలా స్థాయి, హోదా చూడకుండా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితిని ఊహించే మన ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ చేసిన ఏ విమర్శలకూ స్పందించలేదు. మౌనం పాటిస్తూ ఆయన వలలో పడకుండా చూసుకున్నారు. మోదీ ఈ హుందాతనం వల్లే ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే సాహసం ట్రంప్ చేయలేదు.
News January 22, 2026
నైనీ కోల్ బ్లాక్ టెండర్ నోటిఫికేషన్ రద్దు: సింగరేణి

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్పై వివాదం రేగడంతో దానిని రద్దు చేస్తున్నట్లు ఇటీవల Dy CM భట్టి విక్రమార్క ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఆ టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రకటించింది. అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనపై SCCLను ప్రశ్నించింది. దీంతో టెండర్లపై మరోసారి బోర్డులో చర్చించి నిర్ణయిస్తామని చెప్పిన సంస్థ తదుపరి చర్యలు చేపట్టింది.


