News April 6, 2025
లోకేశ్ సొంత ఇలాకాలో ‘గంజాయి’: YCP

AP: మంత్రి లోకేశ్ సొంత ఇలాకా మంగళగిరిలో గంజాయి పట్టుబడిందని YCP ట్వీట్ చేసింది. ‘కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.2kgs గంజాయి, 8.71gms డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఒక్క చోట పట్టుకున్న గంజాయే ఇంత ఉంటే రాష్ట్రంలో ఎంత ఉందో? 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని లోకేశ్ బీరాలు పలికారు. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదా’ అని విమర్శించింది.
Similar News
News April 7, 2025
చెప్పులు దాస్తే ₹5వేలే ఇచ్చాడని వరుడిపై కర్రలతో దాడి..

కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. UP బిజ్నోర్లో ఓ వరుడిని ₹50వేలు డిమాండ్ చేశారు. అతడు ₹5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.
News April 7, 2025
చిరు వ్యాపారులను కొల్లగొడుతున్న క్విక్ కామర్స్!

నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ సంస్థలు సంప్రదాయ చిరు వ్యాపారుల పొట్టకొడుతున్నాయి. ఈ పది నిమిషాల డెలివరీ సంస్థలు భారీ దేశీ, విదేశీ పెట్టుబడులతో ఆఫర్లు, అర్ధరాత్రి తర్వాతా సేవలు అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో చాలా మంది ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఇదే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో నగర వీధుల్లో కిరాణా, కూరగాయల, పండ్ల దుకాణాలు కనుమరుగవ్వొచ్చు.
News April 7, 2025
MPC మీటింగ్ ప్రారంభం.. రేట్ తగ్గింపుపై ఉత్కంఠ

RBI మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ఆర్థిక పరిస్థితులు, పాలసీ రేట్లపై సమీక్షించనుంది. FEBలో రెపోరేట్ను 6.5నుంచి 6.25కి తగ్గించిన విషయం తెలిసిందే. ఎకనామిక్ గ్రోత్ను ప్రోత్సహిస్తూ మరో 25 బేసిస్ పాయింట్స్ తగ్గించొచ్చని SBI అంచనా వేసింది. కొంతమంది నిపుణులు 50Pts కోత అవసరమంటున్నారు. దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీటింగ్ అనంతరం ఏప్రిల్ 9న ప్రకటన విడుదల చేయనున్నారు.