News March 10, 2025

అధికారిక లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

image

AP: టీటీడీ ఆస్థాన గాయకులు, ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలోని స్వగృహంలో ఆయన నిన్న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గరిమెళ్ల ఇద్దరు కుమారులు అమెరికా నుంచి మంగళవారం తిరుపతి చేరుకోనున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News March 10, 2025

పదవులు రాలేదని ఆందోళన చెందొద్దు: లోకేశ్

image

AP: పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి లోకేశ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని భరోసా కల్పించారు. MLCలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు. దీంతో బలహీనవర్గాలపై TDP చిత్తశుద్ధి మరోసారి చాటుకుందన్నారు. మహిళలు, యువతను ప్రోత్సహించేందుకే గ్రీష్మకు అవకాశం ఇచ్చామని తెలిపారు. MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు సీనియర్లకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.

News March 10, 2025

గ్రూప్-1 ఫలితాలు విడుదల

image

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్‌లో <<>>ఫలితాలు తెలుసుకోవచ్చు. 563 పోస్టులకుగానూ గతేడాది జరిగిన మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అటు రేపు గ్రూప్-2 రిజల్ట్స్ రానున్నాయి.

News March 10, 2025

IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం

image

మరికొన్ని రోజుల్లో IPL టోర్నీ ప్రారంభం కానుండగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ BCCIతో పాటు IPL ఛైర్మన్‌కు లేఖ రాసింది. అలాగే, క్రీడాకారులు, కామెంటేటర్స్ కూడా ప్రమోట్ చేయొద్దని ఆరోగ్య శాఖ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. IPLను యూత్ ఎక్కువగా చూస్తుండటంతో పొగాకు, మద్యం యాడ్స్ వీరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

error: Content is protected !!