News March 10, 2025
అధికారిక లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

AP: టీటీడీ ఆస్థాన గాయకులు, ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలోని స్వగృహంలో ఆయన నిన్న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గరిమెళ్ల ఇద్దరు కుమారులు అమెరికా నుంచి మంగళవారం తిరుపతి చేరుకోనున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News October 19, 2025
ఓటమిపై కెప్టెన్ గిల్ ఏమన్నారంటే?

పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోవడం తమను దెబ్బతీసిందని టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అన్నారు. ఆస్ట్రేలియాతో ఓటమి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఓటమితో చాలా పాఠాలు నేర్చుకున్నామని, ఇదో పాజిటివ్ విషయమని చెప్పారు. 131 పరుగుల లక్ష్యఛేదనను చాలా డీప్గా తీసుకెళ్లామని, తమకు సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. ఈ మ్యాచులో రోహిత్ (8), కోహ్లీ (0), గిల్ (10) పవర్ ప్లేలోనే వెనుదిరిగారు.
News October 19, 2025
HCUలో 52 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) 52 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 24 అప్లైకి చివరితేదీ కాగా.. NOV 8 వరకు పొడిగించింది. మొత్తం పోస్టుల్లో Asst లైబ్రేరియన్, Asst రిజిస్ట్రార్, Sr అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, Jr ఆఫీస్ అసిస్టెంట్, Lab అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, PG, బీటెక్, ఎంటెక్తో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://uohyd.ac.in/
News October 19, 2025
అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని APSDMA తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.