News August 8, 2024
రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్ న్యూస్!

TG: రూ.500కే గ్యాస్ సిలిండర్పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. గ్యాస్ రాయితీ సొమ్మును 2 రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలని CM రేవంత్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ డబ్బులు జమ అయ్యేందుకు నాలుగైదు రోజులు పడుతోంది. మరోవైపు ఈ స్కీం ప్రారంభించినప్పుడు 39.50 లక్షలుగా ఉన్న లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రాల్లో సవరణకు అవకాశం ఇవ్వడంతో తాజాగా 44.10 లక్షలకు చేరారు.
Similar News
News December 26, 2025
జాతకం లేకపోతే ఎలా?

జాతకం లేకపోయినా కొన్ని శక్తివంతమైన పారాయణల దోషాలను అడ్డుకుంటాయి. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం, ఆర్థిక కష్టాలకు విష్ణు సహస్రనామం, అప్పుల విముక్తికి అంగారక స్తోత్రం పఠించాలి. వివాహ ప్రాప్తికి రుక్మిణి కల్యాణం, సంతానం కోసం సంతాన గోపాల వ్రతం పనిచేస్తాయి. నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తే సకల విజయాలు కలుగుతాయి. గాయత్రీ మంత్రం జపించడం, దానాలు చేయడం జాతక దోషాలను తొలగించి శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్ర వచనం.
News December 26, 2025
APPLY NOW: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 14 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్/ మెకానికల్/ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 11వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aai.aero/
News December 26, 2025
‘రుషికొండ’ను TTDకి అప్పగించాలి: BJP MLA

AP: విశాఖపట్నం రుషికొండ భవనాలను, కింద ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈనెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా BJP MLA విష్ణు కుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘రుషికొండను ఆదాయవనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. TTDకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి’ అని కోరారు.


