News April 9, 2025

గ్యాస్ ధరల పెంపు.. వారిపై నో ఎఫెక్ట్

image

TG: కేంద్రం వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయం మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు వర్తించదు. ధరలు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ఇస్తానని ప్రకటించడమే దీనికి కారణం. దీంతో ఈ పెంపు ఎఫెక్ట్ మిగిలిన LPG గ్యాస్ వినియోగదారులపై పడనుంది. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కుటుంబాలపై అదనపు భారం పడనుండగా 39 లక్షల మహాలక్ష్మి లబ్ధిదారులకు ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి ధర రూ.905-రూ.928.50కి చేరింది.

Similar News

News January 26, 2026

ఎక్కువ వెల గొడ్డును, తక్కువ వెల గుడ్డను కొనరాదు

image

ఎక్కువ ధర పెట్టి పశువును కొన్నప్పుడు, అది అనుకోకుండా మరణిస్తే యజమానికి భారీ నష్టం వాటిల్లుతుంది. అలాగే మరీ తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని బట్టలు కొంటే అవి చిరిగిపోయి, రంగు వెలిసి, ముడుచుకుపోతాయి. అందుకే ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానితో ముడిపడి ఉన్న ప్రమాదం, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి. అనవసర ఆడంబరానికి పోయి ఎక్కువ వెల పెట్టకూడదు, అతి తక్కువ ధరకు ఆశపడి నాణ్యత లేని వస్తువును తీసుకోకూడదు.

News January 26, 2026

నేడు వీటిని దానం చేస్తే..

image

ఈరోజు దానధర్మాలు చేస్తే అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. నేడు బియ్యం, పప్పులు, కూరగాయలు దానం చేయాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం శ్రేష్ఠం. ఆవులకు పశుగ్రాసం తినిపించి, వైష్ణవాలయాలను సందర్శించాలి. ఇలా భక్తితో దానాలు చేసి ఉపవాసం ఉంటే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, గ్రహ దోషాలు నశించి వంశాభివృద్ధి, మనశ్శాంతి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ చిన్న సాయం జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది.

News January 26, 2026

నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

image

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్‌ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.