News March 10, 2025

ఓటముల బాధ్యుడు గౌతీ CT విజయానికి అవ్వరా..!

image

ట్రాన్సిషన్ పీరియడ్లో కోచింగ్ అంత ఈజీ కాదు. Sr వెళ్లిపోయే, Jr తమ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంటున్న వేళ జట్టుకూర్పు సంక్లిష్టంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో, ఏ ప్లేసులో, ఎవరెలా ఆడతారో తెలియాలంటే ప్రయోగాలు తప్పనిసరి. ప్రతి ప్రయోగం సక్సెస్ అవుతుందన్న రూలేం లేదు. ఇది అర్థం చేసుకోలేకే శ్రీలంక, కివీస్‌ చేతుల్లో ఓడగానే వేళ్లన్నీ గౌతీవైపే చూపాయి. మరిప్పుడు CT విజయ కీర్తి అతడికి దక్కినట్టేనా! విమర్శలు ఆగేనా!

Similar News

News March 10, 2025

కేంద్రమంత్రి నాలిక అదుపులో పెట్టుకోవాలి: సీఎం స్టాలిన్

image

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ధర్మేంద్ర తనను తాను రాజు అనుకుంటున్నారు. ఆయన నాలిక అదుపులో పెట్టుకోవాలి. ‘పీఎం శ్రీ’ పథకాన్ని మేమెప్పుడూ ఒప్పుకోలేదు. కానీ మేం ఒప్పుకుని మాట మార్చామంటూ ఆయన అవాస్తవాలు చెబుతున్నారు. మీరు తమిళనాడు విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తారా లేదా ముందు అది చెప్పండి’ అని ప్రశ్నించారు.

News March 10, 2025

పుష్ప-2 లాభాలను దానికోసం వాడేలా చూడండి: హైకోర్టులో పిల్

image

TG: పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను చిన్న బడ్జెట్ సినిమాల రాయితీకి ఉపయోగించాలని నరసింహారావు అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం లాభాలను కళాకారుల సంక్షేమానికి వాడాలని అందులో కోరారు. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన పుష్ప-2 అన్ని భాషల్లో కలిసి రూ.1800 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.

News March 10, 2025

షుగర్ బాధితులకు GOOD NEWS

image

డయాబెటిస్ రోగులకు అవసరమైన ఔషధాల భారం తగ్గనుంది. దేశీయ ఫార్మా కంపెనీలు త్వరలో Empagliflozin జనరిక్ వెర్షన్‌ ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. మార్చి 11 నుంచి ఈ డ్రగ్‌పై పేటెంటు ముగుస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం రూ.60గా ఉన్న ట్యాబ్లెట్ జనరిక్‌లో రూ.9-14కే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 10.1 కోట్ల మంది షుగర్ పేషంట్లు ఉన్నారు.

error: Content is protected !!