News April 11, 2025

GDK: గతంలో తల్లి కిడ్నీ దానం చేసింది… అయినా దక్కని ప్రాణాలు

image

గోదావరిఖని రాంనగర్ కు చెందిన జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు నీలం ఐలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈరోజు మరణించారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత కొంతకాలం క్రితం ఐలయ్యకు తల్లి ఒక కిడ్నీ దానం చేశారు. కొంతకాలం ఆరోగ్యంగా ఉన్న ఐలయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఐలయ్య మరణించడం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Similar News

News November 28, 2025

వనపర్తి: చిన్న నీటి వనరుల గణనకు శిక్షణ

image

వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో చిన్న తరహా నీటి వనరుల గణన కోసం ఎన్యూమరేటర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ హరికృష్ణ, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, అదనపు కలెక్టర్ శ్రావ్య పాల్గొని సూచనలు చేశారు. కేంద్ర జల వనరుల శాఖ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ ఎన్యూమరేషన్‌ను జాగ్రత్తగా పూర్తి చేయాలని వారు కోరారు. ఈ శిక్షణకు ఏఈవోలు, జీపీవోలు, ఎఫ్‌ఏలు, టీఏలు హాజరయ్యారు.

News November 28, 2025

స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

image

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్‌లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్‌లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్‌’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్‌ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.

News November 28, 2025

కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

image

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.