News April 15, 2025

GDK: తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

image

ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే సన్న బియ్యం ప్లాస్టిక్ బియ్యమని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న గోదావరిఖని తిలక్ నగర్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో తప్పుడు వీడియో చిత్రీకరించి, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వ్యక్తిపై సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 19, 2025

అక్టోబర్ 19: చరిత్రలో ఈ రోజు

image

1952: ప్రత్యేకాంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం
1917: గణిత శాస్త్రవేత్త ఎస్ఎస్ శ్రీఖండే జననం
1955: నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజు జననం
1987: భారత టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని జననం
1986: ఏపీ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య మరణం
2006: నటి, గాయని శ్రీవిద్య మరణం
2015: హాస్యనటుడు కళ్లు చిదంబరం మరణం

News October 19, 2025

ఈ దీపావళిని ఇలా జరుపుకుందాం!

image

దీపావళి అంటే చీకటిని తరిమేసి, ఇళ్లలో దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ వెలుగులు నింపే బాధ్యతను తీసుకొని వారింట్లోనూ పండుగ జరిగేలా చర్యలు తీసుకుందాం. ఇంట్లోని బట్టలు, వస్తువులు, లేదా ఆర్థిక సాయం చేసి పేదలకు అండగా నిలుద్దాం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారానే పండుగకు నిజమైన అర్థం వస్తుంది. ఏమంటారు?

News October 19, 2025

బెల్లంపల్లి: ఈనెల 26న మెగా జాబ్ మేళా

image

బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ క్రీడా మైదానంలో ఈ నెల 26న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా కోసం మైదానాన్ని మందమర్రి జీఎం రాధాకృష్ణ పరిశీలించారు. జాబ్ మేళాకు మందమర్రి, బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలోని సుమారు 7,000 మంది నిరుద్యోగ యువత రానున్నట్లు ఆయన సూచనప్రాయంగా తెలిపారు. జాబ్ మేళాకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పాలు సలహాలు, సూచనలు చేశారు.