News April 15, 2025
GDK: తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే సన్న బియ్యం ప్లాస్టిక్ బియ్యమని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న గోదావరిఖని తిలక్ నగర్కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో తప్పుడు వీడియో చిత్రీకరించి, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వ్యక్తిపై సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
అన్నమయ్య: సన్నిహితులే రాక్షసులు

మన చుట్టూ సన్నిహితంగా ఉండే వారే రాక్షసులుగా మారి బాలికల్ని చిదిమేస్తున్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని <<17714750>>మదనపల్లె<<>>, <<17720487>>తంబళ్లపల్లె<<>>లో జరిగిన 2 అత్యాచార ఘటనలు బాలికలపై ఉన్న భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదనే భయాన్ని తల్లిదండ్రుల్లో కలిగిస్తున్నాయి. ఇలాంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
News September 16, 2025
ఏలూరు: కాలువలో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

ఏలూరు కొత్తూరు జూట్ మిల్లు వద్ద కాలువలో లభ్యమైన మృతదేహాన్ని గ్రీన్ సిటీకి చెందిన కోట ప్రసాద్ (48)గా పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడంతో పడమర లాకుల్లో పడి కొట్టుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
MBNR: SP సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

MBNRలోని పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు.
✒CC కెమెరాల నిఘా పెంచి, పని చేయని కెమెరాలను వెంటనే రిపేర్ చేయాలి.
✒పెండింగ్లో ఉన్న అరెస్టులు, FSL రిపోర్టులు పూర్తి చేయాలి.
✒ప్రజావాణి.. వెంటనే చర్యలు తీసుకోవాలి.
✒POCSO కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
✒వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.