News April 15, 2025

GDK: తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

image

ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే సన్న బియ్యం ప్లాస్టిక్ బియ్యమని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న గోదావరిఖని తిలక్ నగర్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో తప్పుడు వీడియో చిత్రీకరించి, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వ్యక్తిపై సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

పెద్దపల్లి: పోస్ట్ బాక్సులు.. గుర్తున్నాయా..?

image

ఒకప్పుడు లేఖలతో పోస్ట్ బాక్సులు కళకళలాడేవి. ఆత్మీయుల శుభాకాంక్షలు, మనసులోని మాటలతో పలకరించేవి. అలాంటి మధుర జ్ఞాపకాలకు నెలవైన పోస్ట్ డబ్బాలు నేడు కనుమరుగయ్యాయి. ఫోన్లు, సోషల్ మీడియా రాకతో ఆ తపాలా పెట్టెలు ఆదరణ కోల్పోతున్నాయి. నేడు కేవలం ఖాళీ పెట్టెలు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. PDPL(D) ధర్మారంలో తీసిన చిత్రమిది. ఇక అప్పటి మధుర జ్ఞాపకాలను మోసిన పోస్ట్ బాక్సులతో మీకున్న అనుబంధాన్ని COMMENT చేయండి.

News December 4, 2025

కాగజ్‌నగర్‌లో మళ్లీ పులి భయం

image

కాగజ్‌నగర్ డివిజన్‌లో మళ్లీ పులి భయం మొదలైంది. నవంబర్ నెలలోనే నలుగురు పులి దాడిలో మరణించారు. పులులు నవంబర్, డిసెంబర్ నెలల్లో తమ ఆవాసం, తోడు కోసం సంచరిస్తుంటాయి. తన ప్రయాణంలో ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం 10 కిలోమీటర్లకు పైగా తిరుగుతాయి. నిలకడ లేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెంచికల్పేట్ మండలంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.

News December 4, 2025

KMR: మరోసారి అవకాశం కల్పిస్తా ఈ సారికి ఆగు..!

image

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మూడో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.