News July 17, 2024

GDK: అరుణాచల గిరి ప్రదర్శనకు ఆర్టీసీ బస్సు

image

గురుపౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 21న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తులకు TS- RTCగోదావరిఖని నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు DMనాగభూషణం తెలిపారు. ఈనెల 19న రాత్రి 7 గంటలకు గోదావరిఖనిలో బయలుదేరి కరీంనగర్‌కు చేరుకొని అక్కడి నుంచి రాత్రి 8:45కు ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు www.tsrtconline.inలో సర్వీస్ no.69999 బుక్ చేసుకోవాలన్నారు.

Similar News

News May 8, 2025

KNR-2 డిపోను సందర్శించిన జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

image

KNR జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి పోలమన్ KNR–2 డిపోను సందర్శించారు. డిపోలో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, ఛార్జింగ్ పాయింట్లు, వాటి మెంటేనెన్స్, ప్రాక్టీసెస్ గురించి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన సేవల కోసం తగు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం KNR బస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో KNR RM బి.రాజు, అధికారులు ఉన్నారు.

News May 7, 2025

KNR: జిల్లా స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రంలోనే మోడల్‌గా నిలవాలి: కలెక్టర్

image

కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. స్పోర్ట్స్ స్కూల్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. 

News May 7, 2025

కరీంనగర్: రైతుల సంక్షేమం కోసమే భూభారతి: కలెక్టర్

image

రైతుల భూ సమస్యలు పరిష్కరించి,వారి సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ రైతువేదిక, కొత్తపల్లిలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ధరణి చట్టంలో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించలేదని, భూభారతి చట్టంలో మాత్రం పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు.