News August 15, 2025

GDK: ఈనెల 17న అరుణాచలంకు ప్రత్యేక బస్సు

image

ఈనెల 17న మ.3 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు గోదావరిఖని RTC డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, విష్ణు కంచి, శివ కంచి, అలంపూర్ జోగులాంబ క్షేత్రాలను దర్శించుకుని తిరిగి 21న బస్సు GDK చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5,600లు, పిల్లలకు రూ.4,400లు.

Similar News

News August 15, 2025

EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

image

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>

News August 15, 2025

తిరుపతి IITలో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 25.

News August 15, 2025

WOW.. మువ్వన్నెల రంగుల్లో మెరిసిన SRSP

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు మూడు రంగుల్లో మెరిసిపోతోంది. ప్రాజెక్టును అధికారులు త్రివర్ణ పతాకం రంగుల్లో అలరారేలా చేయగా ప్రజలు దానిని చూసేందుకు బారులు తీరారు. చూసేందుకు కన్నుల పండువగా ఉండగా నిత్యం ఇలా లైటింగ్‌తో ఉంచితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.