News April 5, 2024
‘2047 నాటికి 8శాతానికి జీడీపీ’.. తమ అంచనా కాదన్న IMF

భారత జీడీపీ 2047 నాటికి 8శాతానికి చేరుతుందన్న IMF ప్రతినిధి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంచనాలపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు IMF భారత ప్రతినిధి హోదాలో చేసినవిగా వర్తిస్తాయని.. అది సంస్థ అభిప్రాయం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై మరో రెండు వారాల్లో నివేదిక రిలీజ్ చేస్తామంది. కాగా గత పదేళ్లలో చేసినట్లు సంస్కరణలు కొనసాగిస్తే GDP 8శాతానికి చేరుతుందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


