News April 5, 2024

‘2047 నాటికి 8శాతానికి జీడీపీ’.. తమ అంచనా కాదన్న IMF

image

భారత జీడీపీ 2047 నాటికి 8శాతానికి చేరుతుందన్న IMF ప్రతినిధి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంచనాలపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు IMF భారత ప్రతినిధి హోదాలో చేసినవిగా వర్తిస్తాయని.. అది సంస్థ అభిప్రాయం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై మరో రెండు వారాల్లో నివేదిక రిలీజ్ చేస్తామంది. కాగా గత పదేళ్లలో చేసినట్లు సంస్కరణలు కొనసాగిస్తే GDP 8శాతానికి చేరుతుందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.

Similar News

News November 3, 2025

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

image

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్​, డీజీపీలను ఆదేశించారు.

News November 3, 2025

గుండెలు పగిలే ఫొటో

image

TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన <<18183124>>ఆర్టీసీ బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించగా, అందులో 10 నెలల పాప కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.

News November 3, 2025

బాత్రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకంటే?

image

బాత్రూమ్‌లో ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి స్నానం ప్రధాన కారణం కాదని, మలమూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఈ ఒత్తిడి వల్ల ‘వాల్సాల్వా మ్యాన్యువర్’ జరిగి రక్తపోటులో ఆకస్మిక హెచ్చుతగ్గులు సంభవిస్తాయని తెలిపారు. దీనివల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయిన వారికి ఆక్సిజన్ సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.