News March 15, 2025

GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

image

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.

Similar News

News February 26, 2026

తిరుపతి: మూడేళ్లపాటు ఉచితంగా సివిల్స్ కోచింగ్

image

తిరుపతిలోని APSPDCL సీఎండీ కార్యాలయంలో “వెంకటపతి విద్యా దీవెన” పేరుతో పేద, వెనుకబడిన వర్గాల యువతకు రాష్ట్ర, కేంద్ర సివిల్ సర్వీసుల కోసం మూడేళ్లపాటు ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్, కోచింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలురకు వినుకొండలో, బాలికలకు కేతనకొండ (విజయవాడ)లో ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు.

News February 26, 2026

గుంటూరు: ఆ ముగ్గురు DSPలకు షాక్..!

image

ఏపీలో 2018 గ్రూప్-1 సెలక్షన్‌కు సంబంధించి అవకతవకలు, అక్రమాలు జరిగాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న గుంటూరు వెస్ట్ DSP అరవింద్, సౌత్ DSP బానోదయ, గురజాల DSP జగదీశ్ ఉన్నారు. వీరిని వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలన్నారు.

News February 26, 2026

భూపాలపల్లి: నేటి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

image

భూపాలపల్లి జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నట్లు నోడల్ అధికారి వెంకన్న తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలోని 8 కేంద్రాల్లో మొత్తం 1,936 మంది విద్యార్థులు (1,586 జనరల్, 350 ఒకేషనల్) హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.