News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
Similar News
News September 18, 2025
బీడీ కార్మికుల పిల్లలకు మరో అవకాశం..!

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగించినట్లు జగిత్యాల బీడీ కార్మికుల దవాఖానా మెడికల్ ఆఫీసర్ డా.శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాల పేరు పోర్టల్లో కనిపించకపోతే సమస్యలను wclwohyd@nic.inకు పంపాలన్నారు. సందేహాలుంటే 9966621170కు కాల్ చేయవచ్చన్నారు.
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
News September 18, 2025
2027 గోదావరి పుష్కరాల కోసం ధర్మపురిలో ఏర్పాట్లు ప్రారంభం

2027లో మొదలయ్యే గోదావరి పుష్కరాల కోసం ధర్మపురిలో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మాస్టర్ ప్లాన్, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు, రోడ్లు, పార్కింగ్, నీరు, వైద్య సేవలపై సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.