News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
Similar News
News November 21, 2025
డైరెక్షన్పై అల్లరి నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని నటుడు అల్లరి నరేశ్ అన్నారు. తాను తెరకెక్కించే సినిమా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’లా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పారు. తాను నటించిన తొలి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ అని, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు. సమాంతరంగా మూడు నాలుగు కథలు జరుగుతుంటాయని చెప్పారు. ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కానుంది.
News November 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 21, 2025
MNCL: ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి: డి.భాగ్యవతి

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ రూ.4వేలు అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి డి.భాగ్యవతి తెలిపారు. మండల, జిల్లా, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు 2025 – 26 ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కోసం డిసెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


