News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
Similar News
News December 5, 2025
నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులతో పోలిస్తే.. చలి తీవ్రత కాస్త తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 18.4, రాజాపూర్ 18.7, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ మండలం దోనూరు 18.9, మహమ్మదాబాద్, హన్వాడ 19.5, జడ్చర్ల 20.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News December 5, 2025
నిర్మల్: రోడ్ల గుంతల కోసం క్యూఆర్ కోడ్.. కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్

నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల మరమ్మతు కోసం కలెక్టర్ అభిలాష అభినవ్ క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న గుంతల ఫోటోలను పూర్తి వివరాలతో సహా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులకు పంపవచ్చు. సమాచారం ఆధారంగా గుంతలను తక్షణమే పూడ్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గుంతలు లేని రోడ్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
News December 5, 2025
వనపర్తి: 451 మంది వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు..!

జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీల్లోని 806 వార్డులకు గురువారం మొత్తం 451 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 70 నామినేషన్లు.
✓ పానగల్ – 123 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 117 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్ – 70 నామినేషన్లు.
✓ వీపనగండ్ల – 71 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం వార్డు సభ్యుల నామినేషన్లు 490కి చేరింది.


