News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
Similar News
News March 14, 2026
హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

భారత్కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.
News March 14, 2026
BIG SCREENపై ఆదిలాబాద్ యువకులు

ఇటీవల విడుదలైన ఓ చిత్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మెరిశారు. గుడిహత్నూర్ రైతు బిడ్డ అనికేత్ గిట్టేతో పాటు పట్టణానికి చెందిన జగత్ ప్రతాప్, నిహల్ సింగ్, ధీరజ్ జాట్, ప్రవీణ్ జోష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో కొద్ది నిమిషాల పాటు వీరు వెండితెరపై కనిపించి అలరించారు. జిల్లా యువత ప్రతిభను చాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 14, 2026
తిరుపతి: హాల్ టికెట్ ఉంటే ఫ్రీ జర్నీ

తిరుపతి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. బస్సులో హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. పరీక్షల రోజుల్లో అదనపు ట్రిప్పులు నడపాలని తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.జగదీష్ డిపో మేనేజర్లను ఆదేశించారు.


