News March 30, 2025
GDWL: శిక్షణకు వచ్చి IPS అధికారి మృతి

హైదరాబాద్-శ్రీశైలం హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ర్టకు చెందిన IPS అధికారి సుధాకర్తో పాటు ఆయన బంధువు కిషన్ రావు మృతి చెందారు. వారం రోజుల ప్రత్యేక శిక్షణ నిమిత్తం హైదరాబాద్ పోలీస్ అకాడమీకి వచ్చారు. శ్రీశైలానికి వెళ్లగా నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వారు మృతి చెందారు.
Similar News
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.
News December 1, 2025
ఆత్మకూరులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సోమవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన రూ.15 కోట్ల చొప్పున ఆత్మకూరు, అమరచింత నగర అభివృద్ధి పనులకు, రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, రూ.121.92 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
News December 1, 2025
మహబూబాబాద్ డీఈఓగా రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ

జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈఓగా పనిచేసిన దక్షిణామూర్తి వీఆర్ఎస్ తీసుకోవడంతో, విద్యాశాఖ ఏడీగా ఉన్న రాజేశ్వర్ను డీఈఓగా నియమించారు. జిల్లా విద్యాశాఖ సిబ్బంది, పలువురు నూతనంగా బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్రావుకు అభినందనలు తెలిపారు.


