News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
Similar News
News September 16, 2025
పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ బదిలీ

పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ బదిలీ అయ్యారు. ఆయనను మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శౌర్యమన్ పటేల్ శిక్షణ పూర్తయిన తరువాత పాడేరు సబ్ కలెక్టర్గా 2024 సెప్టెంబరులో నియమితులయ్యారు. అయితే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
News September 16, 2025
ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.
News September 16, 2025
కర్నూలు జిల్లాలో 88 టీచర్ పోస్టులు మిగిలిపోయాయి..!

మెగా డీఎస్సీకి అర్హత గల అభ్యర్థులు లేకపోవడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 88 టీచర్ పోస్టులు మిగిలిపోయాయని DEO శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 64, మున్సిపల్ కార్పొరేషన్ 7, మున్సిపాలిటీ పరిధిలో 12, ట్రైబల్ /చెంచుల విభాగంలో 5 ఐదు పోస్టులు భర్తీకి నోచుకోలేదన్నారు. టీచర్ పోస్టుల భర్తీ తుది జాబితా https://www.deokrnl13.blogspot.comలో అందుబాటులో ఉంచామన్నారు