News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
Similar News
News February 22, 2026
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

చెన్నైలోని CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 3 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి M.Tech(ఫుట్వేర్ Engg.&మేనేజ్మెంట్, MSc (బయోటెక్నాలజీ/బయోసైన్స్/బయోకెమిస్ట్రీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 16న రాత పరీక్ష, 18న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. NET/GATE అర్హత కలిగినవారు రాత పరీక్షకు హాజరుకానవసరం లేదు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్సైట్: clri.org/
News February 22, 2026
11 సార్లు రామాయణాన్ని వీక్షించిన మహర్షి

కాకి ముఖం, మానవ శరీరంతో ఉండే కాగ్భుషుండి మహర్షి రామాయణాన్ని 11 సార్లు, భారతాన్ని 16 సార్లు వీక్షించారని పురాణాల వాక్కు. లోమశ మహర్షి శాపంతో ఈ రూపం పొందారట. రాముడిపై భక్తితో చిరంజీవిగా నిలిచారని చెబుతారు. జ్ఞాన సముపార్జనలో రూపం ముఖ్యం కాదని, అహంకారాన్ని వీడి రామనామాన్ని జపించడమే పరమార్థమని ఆయన వశిష్ఠ మహర్షికే బోధించారు. గరుత్మంతుడి సందేహాలను నివృత్తి చేస్తూ రామాయణ రహస్యాలను వివరించిన జ్ఞాని ఈయన.
News February 22, 2026
సంగారెడ్డి: కూతురికి ఫోన్ చేసి సూసైడ్!

కుటుంబ కలతలతో ఖేడ్ ఆర్టీసీ డిపో డ్రైవర్ పాపయ్య (45) మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మరణం తర్వాత పిల్లల పోషణ భారమై, మానసిక వేదన చెందేవాడు. శుక్రవారం కూతురికి ఫోన్ చేసి నాకు భయంగా ఉందని నేను చనిపోతున్నాను నీవు, తమ్ముడు బాగుండండి అంటూ నదిలో దూకాడు. హద్నూర్ పోలీసులు గాలింపు చేపట్టి శనివారం మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


