News March 23, 2024
మాస్కోలో నరమేధం.. ఖండించిన తాలిబన్లు, హమాస్

మాస్కోలో జరిగిన మారణకాండను ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్ తాలిబన్లు, హమాస్ ప్రతినిధులు ప్రకటించారు. మృతి చెందిన పౌరులకు సంతాపం, రష్యా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు హమాస్ తెలిపింది. మాస్కోలో సంగీత కచేరి జరుగుతుండగా తుపాకులతో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 150 మంది మరణించారు. UNO భద్రతా మండలితో పాటు పలు దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
Similar News
News July 10, 2025
విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

AP: లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విజయసాయి ఒకసారి విచారణకు హాజరయ్యారు.
News July 10, 2025
కష్టపడుతున్న భారత బౌలర్లు

భారత్తో మూడో టెస్టులో ఫస్ట్ సెషన్లో కాస్త తడబడ్డ ఇంగ్లండ్ రెండో సెషన్లో ఆధిపత్యం చెలాయించింది. టీ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్లకు 153 రన్స్ చేసింది. రూట్ 54*, పోప్ 44* రన్స్తో క్రీజులో నిలదొక్కుకున్నారు. 44 రన్స్కే ఇద్దరు ఇంగ్లిష్ బ్యాటర్ల వికెట్లు తీసిన నితీశ్ భారత్కు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే మిగతా బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ ప్రభావం చూపలేకపోయారు.
News July 10, 2025
తొలి క్వార్టర్: TCSకు రూ.12,760 కోట్ల లాభం

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో భారత టెక్ దిగ్గజం TCS రూ.12,760 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. గతేడాది ఇదే పీరియడ్(రూ.12,040 కోట్లు)తో పోలిస్తే లాభం 6 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం రూ.62,613 కోట్ల నుంచి రూ.63,437 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0.30% పెరిగి 24.5%కు ఎగిసింది. కాగా ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్ను కంపెనీ డిక్లేర్ చేసింది.