News October 8, 2024
దృశ్యం-3కి రంగం సిద్ధం!

జీతూ జోసెఫ్ డైరెక్షన్లో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దృశ్యం-3 మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సమాచారం. 2025 క్రిస్మస్ నాటికి విడుదల చేసేలా మూవీ యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘దృశ్యం’ రెండు భాగాలు దాదాపు అన్ని భాషల్లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో వెంకటేశ్, మీనా నటించారు.
Similar News
News November 18, 2025
సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే?

మిగతా గృహ నిర్మాణం అంతా వాస్తు ప్రకారం ఉంటే సింహద్వారం ప్రభావం కొద్దిగా తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉంటూ సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోయినా పెద్దగా దోషం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘వ్యక్తిగత పేరు, జన్మరాశి ఆధారంగా సింహద్వారం ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. వాస్తుపరమైన ఇతర సానుకూలతలు ఈ లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>
News November 18, 2025
డేటా క్లియర్ చేసి.. ల్యాప్టాప్, సెల్ఫోన్ దాచిన రవి!

TG: అరెస్ట్ సమయంలో గంటన్నరపాటు ఐ-బొమ్మ రవి ఇంటి తలుపులు తెరవలేదని పోలీసులు తెలిపారు. తాము వచ్చింది చూసి టెలిగ్రామ్, మొబైల్ డేటాను క్లియర్ చేశాడని చెప్పారు. ల్యాప్టాప్ను బాత్రూమ్ రూఫ్ కింద, సెల్ఫోన్ను అల్మారాలో దాచినట్లు వివరించారు. అటు పోలీసుల విచారణలో రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. స్నేహితులు, బంధువులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నాడు.
News November 18, 2025
‘VSP STEEL’ ప్రైవేటీకరణకు CBN కుట్ర: రజిని

AP: కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే కుట్రలకు CBN తెరలేపారని మాజీ మంత్రి రజిని ఆరోపించారు. వైట్ ఎలిఫెంట్ అన్న ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. NDAలో భాగం కాకున్నా జగన్ తన హయాంలో ప్రైవేటుపరం కాకుండా ఆపారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP సపోర్టుతో నడుస్తున్నా ఆ దిశగా కదులుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు బాబు ప్లాంటుకు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.


