News January 8, 2025

PMతో ప్రత్యేక‌హోదా ప్రకటన చేయించండి: షర్మిల

image

AP: విశాఖ వస్తున్న PM మోదీతో రాష్ట్రానికి ప్రత్యేక‌హోదా ప్రకటన చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. ‘చంద్రబాబు గారూ మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక‌హోదా అన్నారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని PMతో పలికించండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 18, 2025

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

image

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్‌లో ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖదేనని తీర్పునిచ్చింది. ఈ భూమి తమదేనని కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 8వారాల్లో భూమిని నోటిఫై చేయాలని CSను ఆదేశించింది. దీని విలువ రూ.వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

News December 18, 2025

ఈశాన్య మూల పెరగడం మంచిదేనా?

image

ఈశాన్య మూల పెరిగిన స్థలం సంపదలకు మూలమని కొందరు చెబుతారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం శుభకరమని నమ్ముతారు. అయితే, ఈశాన్యం మరీ ఎక్కువగా పెరగడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దీనివల్ల ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం మూలలు తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ దిశల నుంచి దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అందుకే కేవలం స్థలం ప్రహరీగోడలో స్వల్పంగా మార్పు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News December 18, 2025

ఫలితాలు విడుదల

image

TG: గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.