News September 15, 2024
ఏడాదికి ఓసారైనా ఈ పరీక్షలు చేయించండి

ఎంత ఆరోగ్యవంతులైనా ఏడాదికి కనీసం ఒక్కసారైనా కొన్ని టెస్టులు చేయించాలంటున్నారు అపోలో వైద్యుడు డా. సుధీర్ కుమార్. షుగర్, బీపీ టెస్టులే కాకుండా ఎకోకార్డియోగ్రామ్, హీమోగ్లోబిన్, ఈసీజీ, యూరిక్ యాసిడ్, విటమిన్ డీ-బి12, ట్రెడ్మిల్ టెస్ట్, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సహా 20 టెస్టుల్ని చేయిస్తే ముందుగానే పెను సమస్యల్ని గుర్తించొచ్చని ఆయన ట్విటర్లో వివరించారు.
Similar News
News December 21, 2025
దూసుకెళ్తున్న మహాయుతి

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల కౌంటింగ్లో మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. 246 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు, 42 నగర పంచాయతీల్లో బీజేపీ 116+, శివసేన 50+, ఎన్సీపీ 34+ చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. శివసేన యూబీటీ 12, ఎన్సీపీ(SP) 12, కాంగ్రెస్ 28+ స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి.
News December 21, 2025
గిల్పై వేటు.. సూర్యకూ అల్టిమేటం!

T20ల్లో విఫలమవుతున్న గిల్ను వరల్డ్కప్ నుంచి BCCI <<18622627>>తప్పించిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలో రన్స్ చేయలేక తంటాలు పడుతున్న కెప్టెన్ సూర్య కుమార్కూ బోర్డు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫామ్ను అందుకోలేకపోతే జట్టులో చోటు కోల్పోవచ్చని హెచ్చరించినట్లు సమాచారం. ‘ఏడాదిగా పరుగులు చేయకున్నా కెప్టెన్ కావడం వల్ల జట్టులో ఉన్నాడు. పరుగులు చేయకపోతే గిల్ మాదిరే సూర్యపై వేటు పడొచ్చు’ అని PTI కథనం పేర్కొంది.
News December 21, 2025
ప్రపంచంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఇవే.. మనవెక్కడ?

ప్రపంచంలోని బిజీయెస్ట్ రైల్వే స్టేషన్ల లిస్ట్లో జపాన్ టాప్లో ఉంది. టోక్యోలోని ‘షింజుకు’ ఏడాదికి 116 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో తొలి స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏకంగా 8 ఆ దేశంలోనే ఉన్నాయి. ఇండియా నుంచి కోల్కతాలోని హౌరా స్టేషన్ 54 కోట్ల మందితో ఆరు, సియాల్దా స్టేషన్ ఎనిమిదో ప్లేస్లో ఉన్నాయి. అధిక జనసాంద్రత, రోజూ ఆఫీసులకు వెళ్లేవారి రద్దీ వల్లే ఈ స్టేషన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోతున్నాయి.


