News June 9, 2024
పనుల్ని సమయానికి పూర్తి చేయండి: మోదీ

కేబినెట్లో చోటు దక్కిన ఎంపీలకు ప్రధాని మోదీ తేనేటి విందు ఏర్పాటు చేశారు. పరిపాలనపై దృష్టి పెట్టాలని, పనుల్ని సమయానికి పూర్తి చేయాలని వారికి సూచించారు. నేడు ప్రధానిగా మోదీతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈసారి మొత్తం 78 మందికి పదవులు దక్కవచ్చని అంచనా. హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ బీజేపీ వద్దే కొనసాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Similar News
News September 10, 2025
కార్మికుల పిల్లలకు రూ.25,000 వరకు స్కాలర్షిప్

కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు చదువును బట్టి రూ.25,000 వరకు ఏటా<
News September 10, 2025
తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ: జగన్

AP: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని మాజీ CM జగన్ విమర్శించారు. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ ప్రయోజనాలు దోపిడీదారులకు అందుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. శాంతిభద్రతలు కనిపించడం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా’ అని ఫైర్ అయ్యారు.
News September 10, 2025
‘అర్క’ టమాటతో రైతుకు భరోసా

టమాటను ఆకుముడత, వడలు తెగులు, ఆకు మాడు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి కట్టడికి IIHA బెంగళూరు ‘అర్కరక్షక్’, ‘అర్క సామ్రాట్’, ‘అర్క అబేద్’ హైబ్రిడ్ రకాలను తీసుకొచ్చింది. ‘అర్క రక్షక్’, ‘అర్కసామ్రాట్’లు ఆకుముడత, వైరస్, వడలు తెగులు, తొలి దశలో ఆకుమచ్చ, మాడు తెగుళ్లను తట్టుకొని 140 రోజులలో ఎకరాకు 30-34 టన్నుల దిగుబడినిస్తాయి. ‘అర్క అబేద్’ 140-150 రోజుల్లో 30-32 టన్నుల దిగుబడినిస్తుంది.