News October 10, 2025
ఘరానా మోసం.. రూ.18 కోట్లు వసూలు చేసిన కిలేడి

సంగారెడ్డి(D) పటాన్చెరులో ఘరానా మోసానికి పాల్పడిందో కిలేడి. కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు వస్తోందని, కంటైనర్లను కొనడానికి డబ్బు అవసరమని విద్య పలువురి వద్ద కోట్లు వసూలు చేసింది. రూ.35 వేలకే తులం బంగారం ఇస్తానని మరికొందరి నుంచి డబ్బు తీసుకుంది. ఇలా మొత్తంగా రూ.18 కోట్లు దండుకుంది. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగిన బాధితులను అనుచరులతో కొట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 10, 2025
AP క్యాబినెట్ నిర్ణయాలు

*పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ఆమోదం
*అమరావతిలో సదరన్ గ్రూప్ హోటల్ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్
*అమరావతిలో రూ.400 కోట్లతో దసపల్లా 4స్టార్ హోటల్ నిర్మాణానికి ఆమోదం
*అనంతపురంలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం
*రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించిన క్యాబినెట్
*పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు అంగీకారం
*ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు ఆమోదం
News October 10, 2025
ఏ దేవుడికి ఏ నూనెతో దీపం వెలిగించాలి?

ఇష్టదైవాన్ని ఆరాధించేటప్పుడు శ్రేయస్సు, ప్రతిష్ఠల కోసం ఆముదం నూనెతో దీపం వెలిగించాలి.
ఆంజనేయుడి కటాక్షం పొందడానికి మల్లెపూల నూనెతో దీపారాధన చేయాలి.
శత్రువుల నుంచి రక్షణ పొందడానికి కాలభైరవుడి ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగించాలి.
ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆవాల నూనెతో దీపారాధన చేయాలి.
రాహు, కేతు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తొలగిపోవడానికి, మునగ నూనెతో దీపం వెలిగించాలి.
News October 10, 2025
అందం కోసం ఆరాటం ప్రాణాలను తీసింది

అందం కోసం సర్జరీలు చేయించుకొనే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అదే ప్రాణాల మీదకు తెస్తుంది. తాజాగా FOX EYES (నీలి కళ్లు) కోసం కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్న బ్రెజిలియన్ ఇన్ఫ్లుయెన్సర్ అడైర్ మెండెస్ దత్రా(31) చనిపోయారు. సర్జరీతో ఆమెకు సివియర్ ఫేషియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఊపిరి కూడా అందక మరణించారు. సర్జరీ తర్వాత సరైన పోషకాహారం ఇతర జాగ్రత్తలు పాటించాలని ప్లాస్టిక్ సర్జన్ కిరణ్మయి సూచించారు.