News October 1, 2024
నెయ్యి కల్తీ వాస్తవం.. ఎవరినీ వదలం: మంత్రి డీబీవీ స్వామి

AP: తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగడం వాస్తవమని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. ఈ ఘటనపై సిట్ను ఏర్పాటుచేశామని, ఇందులో ఎవరి ప్రమేయమున్నా వదిలేది లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తామని తెలిపారు. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ప్రతి నెలా 1న పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగుతోందని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


