News September 20, 2024
నెయ్యిలో నాణ్యత లేదు: టీటీడీ ఈఓ
AP: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75 లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News September 20, 2024
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించారు. సొంత గడ్డపై అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాటర్గా రికార్డులకెక్కారు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన 12,000 పరుగుల మైలురాయి చేరుకుని ఈ ఫీట్ సాధించారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (14,192) ఉన్నారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ (13,117), జాక్వెస్ కలిస్ (12,305), కుమార సంగక్కర (12,043) నిలిచారు.
News September 20, 2024
నిఫ్టీ 50లో 44 స్టాక్స్ బులిష్
దేశీయ స్టాక్ మార్కెట్లోబుల్ జోర్ వల్ల నిఫ్టీ-50లోని 44 స్టాక్లు శుక్రవారం లాభాలు గడించడం గమనార్హం. అధిక వెయిటేజీ గల ICICI రూ.1,362కి ఎగబాకి 52 వారాల హైకి చేరింది. HDFC (1.68%) దన్నుగా నిలవడంతో దేశీయ సూచీలు గరిష్ఠాలకు చేరుకున్నాయి. M&M, ICICI, JSW Steel, L&T, కోల్ ఇండియా టాప్ గెయిన్స్గా నిలిచాయి. ఆటో(1.9%), బ్యాంక్(1.4%), ఫైనాన్షియల్ సర్వీసెస్(1.6%) వృద్ధి చెందాయి.
News September 20, 2024
CM గారూ.. మీ వ్యాఖ్యలు చాలా ప్రభావవంతం: మహీంద్రా
TG: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విషయంలో CM రేవంత్ను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ‘ఆ సదస్సుకు హాజరుకావడం సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్ తన ఆలోచనల్ని ఆచరణలోకి పెట్టడాన్ని చూసి ఎంజాయ్ చేశాను. రేవంత్.. మీరు తక్కువే మాట్లాడినా అవి చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఎలా పనిచేయాలన్నదానికి బలమైన ఉదాహరణ ఇచ్చారు మీరు’ అని పేర్కొన్నారు.