News October 17, 2024
యాదాద్రిలో నెయ్యి స్వచ్ఛమైనదే: ఈవో

TG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి స్వచ్ఛమైనదేనని పరీక్షల్లో తేలినట్లు ఈవో భాస్కరరావు తెలిపారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెయ్యిని పరీక్షలకు పంపామన్నారు. కిలో రూ.609కి కొనుగోలు చేస్తున్న నెయ్యి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నట్లు తెలిపారు. రోజుకు వెయ్యి కిలోల నెయ్యిని మదర్ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
Similar News
News November 26, 2025
HYD: శివారులో మాయమైపోతున్నయమ్మ పల్లెలు!

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని పెద్దలు చెప్పేవారు.. అయితే ఇపుడు నగర శివారులో ఉన్న పల్లెలు మాయమవుతున్నాయి. అవి పట్నాలుగా కాదు.. ఏకంగా నగరంగా మారిపోతున్నాయి. సిటీ చుట్టుపక్కల ఉన్న పల్లెలు, మున్సిపాలిటీలను ప్రభుత్వం GHMCలో విలీనం చేస్తూనే ఉంది. అప్పట్లో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హైదరాబాద్ నగరం 2వేల చదరపు కిలోమీటర్లున్న నగరంగా మారుతోందంటే ఎన్ని పల్లెలు మాయమై ఉంటాయో ఆలోచించండి.
News November 26, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 13

72. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు?
సమాధానం: మెప్పులైనా, నిందలైనా; చలి, వేడిమి; లాభం, నష్టం; సుఖం, దుఃఖం.. వీటన్నింటిలోనూ సమానంగా ఉంటూ, దేనికీ చలించక, లభించిన దానితోనే సంతోషిస్తూ, అహంకారం లేకుండా, మనసును అదుపులో ఉంచుకునే స్థిరమైన బుద్ధి గలవాడే స్థితప్రజ్ఞుడు. ☛ యక్ష ప్రశ్నలు, సమాధానాలు ఇంతటితో పూర్తయ్యాయి. మొదటి ప్రశ్న నుంచి చూడాలనుకుంటే క్లిక్ చేయండి <<-se>>#YakshPrashnalu<<>>.
News November 26, 2025
సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఫొటో, క్యాస్ట్, నో డ్యూస్, బర్త్ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్ జత చేయాలి. అఫిడవిట్లో అభ్యర్థి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. డిపాజిట్ అమౌంట్ (SC, ST, BCలకు రూ.1,000, జనరల్కు రూ.2,000) చెల్లించాలి. Expenditure declaration సమర్పించాలి.
*Share It


