News September 20, 2024

నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు 20 పాయింట్లే ఉంది: టీటీడీ ఈఓ

image

AP: నెయ్యి నాణ్యత ఉంటేనే, లడ్డూ నాణ్యతగా ఉంటుందని టీటీడీ ఈఓ శ్యామలరావు అన్నారు. గతంలో వాడిన నెయ్యి నాణ్యత 100 పాయింట్లకుగానూ 20 పాయింట్లే ఉందని ఆయన తెలిపారు. ‘గతంలో ఏఆర్ డెయిరీ వచ్చిన 4 ట్యాంకర్లలోని నెయ్యిని తిరిగి పంపాం. ఆ నెయ్యిని 10 ల్యాబ్‌లలో పరీక్షించాం. వారంలో రిపోర్టు వచ్చింది. ఆ నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు రిపోర్టులో తేలింది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి రోజు ఇలా చేస్తే..

image

నేటితో కార్తీక మాసం ముగియనుంది. కార్తీక అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుతారు. ఈసారి అది శుక్రవారం వస్తోంది. కార్తీక వ్రతం ఆచరించినవారు ఆ పుణ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఆవు నెయ్యితో వెలిగించిన 31 వత్తుల దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో దారిద్ర్యం తొలగిపోతుందని నమ్మకం. ☞ పోలి పాడ్యమి కథ, పూజా టైమింగ్స్ వంటి ఇతర వివరాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 20, 2025

పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

image

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.

News November 20, 2025

ఫోన్‌పే టాప్!

image

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.