News March 1, 2025

GHMCలో 139 మంది శానిటేషన్ జవాన్ల బదిలీ.!

image

GHMC కమిషనర్ ఇలంబర్తి 139 మంది శానిటేషన్ జవాన్లను బదిలీ చేశారు. మొత్తం 259 మంది సిబ్బందిలో ఐదేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్న వారిని మార్చినట్లు తెలిపారు. నగర శుభ్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శానిటేషన్ సేవల్లో సమర్థత పెంచేందుకు ఈ చర్యలు అవసరమని కమిషనర్ స్పష్టం చేశారు. 

Similar News

News March 3, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 3, 2025

అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లీ..!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్‌ మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వికెట్ తీసిన సందర్భంగా అక్షర్ పటేల్ కాళ్లను తాకేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నించారు. ఇదంతా ఆయన సరదాగా చేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇవాళ్టి మ్యాచులో అక్షర్ అన్ని విభాగాల్లోనూ రాణించారు. 47 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టారు. ఫీల్డింగ్‌లో ఓ అద్భుత క్యాచ్ పట్టారు.

News March 3, 2025

మార్చి 03: చరిత్రలో ఈ రోజు

image

1839: టాటా గ్రూపు వ్యవస్థాపకులు జమ్‌షెట్జీ టాటా జననం
1847: టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం
1938: తెలుగు హాస్య నటి గిరిజ జననం
1967: ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ జననం
1967: నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం
2002: తొలి దళిత లోక్‌సభ స్పీకర్ బాలయోగి మరణం
ప్రపంచ వినికిడి దినోత్సవం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

error: Content is protected !!