News January 20, 2025

GHMC ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.

Similar News

News December 3, 2025

HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

image

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.

News December 3, 2025

HYD: కుక్క దాడిపై సీఎం తీవ్ర ఆవేదన

image

మూగ బాలుడు <<18449713>>ప్రేమ్ చంద్‌పై<<>>వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అవసరమైన తక్షణ సాయాన్ని ప్రభుత్వం పరంగా అందించాని అధికారులను ఢిల్లీనుంచి ఆదేశించారు. GHMC కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.

News December 3, 2025

HYD: విలీనంతో భవిష్యత్ ప్రశ్నార్థకం..!

image

GHMCలో శివారు ప్రాంతాల విలీనానికి ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ విలీనంతో నేతలు, రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ స్థాయి నేతల భవిష్యత్ ప్రశ్నార్థకమైందని వాపోతున్నారు. ఎందుకీ విలీనం, భూములే లేనిచోట అభివృద్ధిపై వివరణ ఎక్కడని ORR పరిసరాల రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, స్ట్రీట్ లైట్లేలేని తమని ట్యాక్స్ కట్టడంలో బంజారాహిల్స్‌తో పోటీ పడమంటారా అని మేడ్చల్, RR ప్రజలు భగ్గుమంటున్నారు.