News August 13, 2024
GHMC: ఆ ప్రాంతాల్లో ఫుట్ బాల్ గ్రౌండ్లు

GHMC గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ ప్రాంతంలో జేసీ నగర్, వలావర్ నగర్, కాప్రా ఛత్రపతి శివాజీ గ్రౌండ్, శేర్లింగంపల్లి గోపనపల్లి తండా, మియాపూర్ బస్ డిపో వెనుక, కూకట్పల్లి ఎస్ఆర్ నాయక్ నగర్, అల్వాల్, ఖైరతాబాద్ లంగర్ హౌస్, సికింద్రాబాద్ తిరుమలగిరి, ప్రాంతాల్లో ఫుట్ బాల్ మైదానాల కోసం స్థలాలను అధికారులు గుర్తించారు.
Similar News
News November 25, 2025
HYD: బాక్సు ట్రాన్స్ఫార్మర్లతో బేఫికర్!

‘చుట్టూ కంచె లేని ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్లు.. పట్టించుకోని పాలకులు’.. తరచూ TGSPDCLకి మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులు. గ్రేటర్లో ఈ సమస్యకు చెక్ పెట్టేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలు నివారించేలా కాంపాక్ట్ సబ్స్టేషన్లు, బాక్సు టైప్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలుత కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, మిగతా ఏరియాలకు విస్తరించనున్నారు.
News November 25, 2025
BREAKING: హబ్సిగూడలో విషాదం.. 10TH క్లాస్ స్టూడెంట్ సూసైడ్

హబ్సిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. 10వ తరగతి విద్యార్థిని(15) బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించగా మనస్తాపనికి గురై సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకొన్న ఓయూ పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 25, 2025
సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.


