News October 25, 2024
GHMC ఇంజినీరింగ్ విభాగం మరింత బలోపేతం

GHMC పరిధిలో ఇంజినీరింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే నూతనంగా ఉద్యోగ పత్రాలు పొందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు 125 మంది జీహెచ్ఎంసీకి రిపోర్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 146 మంది కొత్తగా నియామకమైనట్లు అధికారులు తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News November 9, 2025
గచ్చిబౌలి: ముగిసిన ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పలు దేశాల నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్కంఠభరిత మ్యాచ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్, కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
News November 9, 2025
‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసుఫ్గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నగరంలో హైడ్రా చేసిన విధ్వంసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వీడియోలతో చూపించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఓ వ్యక్తి ‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’ అని రేవంత్ ఫొటోతో ఉన్న బ్యానర్ ప్రదర్శించారు.
News November 9, 2025
జూబ్లీ బైపోల్లో ఓటుకు రూ.2,500- రూ.5వేలు!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సా.5 గంటలకు ముగియనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరులో చివరి రోజు పార్టీలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు, ఓటుకు రూ.2500- రూ.5వేల వరకు పంపిణీ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల సంఘం కట్టడి చర్యలు చేపట్టింది. పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నేటి సా.6 గం నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయి.


