News August 18, 2024

GHMC పరిధిలో మీడియన్ గార్డెనింగ్ పనులు

image

మోడల్ కారిడార్ల పొడవునా అలంకరణ జాతులకు చెందిన మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా అధికారులు నాటుతున్నారు. శేరిలింగంపల్లి, చార్మినార్ జోన్ల పరిధిలోని రోడ్డు విభాగినులపై వరుసగా 1.13 లక్షలు, 70 వేలు, కూకట్‌పల్లి జోన్ రహదారులపై 18 వేల మొక్కలను నాటనున్నారు. ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో 38,400 మొక్కలను నాటుతున్నారు.

Similar News

News October 27, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు

image

HYDలోని బుద్ధభవన్‌లో సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తూములు మూసేసి అలుగుల ఎత్తు పెంచుతున్నారని కొంతమంది, చెరువుల్లో మట్టి పోసి ఎకరాల కొద్ది కబ్జా చేస్తున్నారని మరి కొంతమంది ఫిర్యాదు చేశారన్నారు. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

News October 27, 2025

సికింద్రాబాద్: తుఫాన్.. ఆ రైళ్లు CANCEL

image

తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పలు రైళ్లను క్యాన్సల్ చేసింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్ నుంచి పాండిచ్చేరి వెళ్లే రైళ్లను క్యాన్సల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు రైళ్ల రద్దు కొనసాగుతుందని CPRO శ్రీధర్ తెలిపారు.

News October 27, 2025

HYD: డబ్బు డబుల్ చేస్తామని మోసం.. నిందితుల అరెస్ట్..!

image

“బారిష్ పూజ” పేరిట డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో బహదూర్‌పురకు వాసి, సోఫా వర్కర్ మొహమ్మద్ ఇర్ఫాన్, ఫిల్మ్‌నగర్‌కి చెందిన మేకప్ ఆర్టిస్ట్ గుగులోత్ రవీందర్, సూరారం కాలనీలోని కవిర సాయిబాబా, ఖైరతాబాద్‌కు చెందిన వాషర్‌మన్ ఠాకూర్ మనోహర్ సింగ్ ఉన్నారు.పోలీసులు రూ.8.50లక్షల నగదు, దేశీయ తుపాకి, కత్తి స్వాధీనం చేసుకున్నారు.