News March 25, 2025

GHMC మేయర్ కనిపించడం లేదని ఫిర్యాదు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. GHMC పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడంలేదని కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని శ్రవణ్ ఆరోపించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News November 2, 2025

HYD: KTR రోడ్ షోలో మహేశ్‌బాబు డైలాగ్‌తో ఫ్లెక్సీ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. శనివారం రాత్రి రహమత్‌నగర్‌లో జరిగిన KTR రోడ్ షోలో ఓ కార్యకర్త మహేశ్‌బాబు డైలాగ్‌తో ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘దస్ దిన్‌కే బాద్.. ఇదరీ మిలేంగి.. జెండా పాతేంగి’ అని బిజినెస్‌మెన్ మూవీలోని డైలాగ్ ఫ్లెక్సీని ప్రదర్శించాడు. ‘పది రోజుల్లో ఇక్కడే కలుద్దాం.. BRS జెండా ఎగరేద్దాం’ అంటూ ఆ పార్టీ నేతలు అన్నారు.

News November 2, 2025

వికారాబాద్: కుటుంబ కలహాలే హత్యలకు కారణం..!

image

వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో <<18174716>>ముగ్గురి హత్యలకు కారణం<<>> కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు.. భార్య అలివేలు, ఆమె సోదరి హన్మమ్మ, చిన్న కూతురు శ్రావణి నిద్రిస్తుండగా ఏపూరి యాదయ్య(38) ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు వారిని కత్తితో నరికి చంపాడు. పెద్ద కూతురు అపర్ణపై కూడా దాడి చేయగా తప్పించుకుంది. అనంతరం ఆయన సూసైడ్ చేసుకున్నాడు. DSP శ్రీనివాస్ ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.

News November 2, 2025

HYD: KCR తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు: కిషన్ రెడ్డి

image

‘బంగారు తెలంగాణ’ పేరిట KCR తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 83 కోట్ల మందికి ఉచిత బియ్యం, ఉజ్వల పథకం, మహిళలకు రుణాలు అందిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలిందన్నారు.