News March 24, 2025

GHMC: రూ.2.95 కోట్లతో వాటర్ డ్రెయిన్, VDCC రోడ్లు..!

image

చాంద్రాయణగుట్ట బండ్లగూడలో గల ప్రోగ్రెస్ స్కూల్ నుంచి క్రిస్టల్ టౌన్, డెలివరీ కొరియర్ సర్వీస్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మించనున్నామని GHMC తెలిపింది. అంతేకాక వీడీసీసీ రోడ్ నిర్మాణాలకు రూ.2.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం తెలిపినట్లుగా GHMC తాజాగా నేడు పేర్కొంది.

Similar News

News April 1, 2025

NRPT: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసేలా చూడాలి’

image

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. పథకంపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలని అన్నారు.

News April 1, 2025

హాజీపూర్: మేకల కాపరి అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన హాజీపూర్‌లో చోటుచేసుకుంది. SI వినీత వివరాలు.. ర్యాలీ కొలాంగూడకు చెందిన మేకల కాపరి భీము సోమవారం సాయంత్రం ఊరిలోకి వెళ్లి తిరిగిరాలేదు. రోడ్డు పక్కన తలకు బలమైన గాయాలతో కనిపించడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు చిన్ను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 1, 2025

నా పిల్లలు ఇండియాలోనే పెరగాలి: అమెరికన్ తల్లి

image

తన పిల్లలు భారతదేశంలో పెరిగితేనే ప్రయోజకులు అవుతారని ఓ అమెరికన్ తల్లి SMలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ ఈ పోస్ట్ పెట్టారు. ‘సంపాదనపరంగా US బెస్ట్ ఏమో కానీ.. సంతోషం మాత్రం భారత్‌లోనే దొరుకుతుంది. ఇక్కడ నివసిస్తే భావోద్వేగాలను హ్యాండిల్ చేయొచ్చు. లోతైన సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. కృతజ్ఞతాభావం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నారు.

error: Content is protected !!