News January 30, 2025

GHMC వార్షిక బడ్జెట్‌కు అమోదం

image

GHMC కౌన్సిల్ సమావేశంలో వార్షిక బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాల్‌లో చర్చలేకుండానే 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. అంతకుముందు ఆఫీస్‌లో హైడ్రామా నెలకొంది. భిక్షాటన చేస్తూ BJP కార్పొరేటర్లు, పోడియం వద్ద BRS కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి సభ్యులను అరెస్ట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల నడుమ రూ. 8,440 కోట్ల వార్షిక బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

Similar News

News February 13, 2025

HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

image

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.

News February 13, 2025

హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

image

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.

News February 13, 2025

HYD: ఎమ్మెల్సీకి నోటీసులు జారీ

image

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తోల్కట్ట ఫామ్ హౌస్‌లో కోడిపందేల నిర్వహణ కేసులో నోటీసులు అందజేసినట్లు అధికారుల సమాచారం. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో కోడిపందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు.

error: Content is protected !!